విజయవాడ: గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ను ఎస్ఈసీ రమేశ్ కుమార్ కలిసిన విషయం తెలిసిందే. వీరి భేటీ వివరాలను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మీడియకు తెలిపారు. ప్రభుత్వానికి, ఎస్ఈసీకి వారదిగా ఉంటానని గవర్నర్ హరిచందన్ హామీ ఇచ్చినట్లు రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం, ఉద్యోగుల పాత్రపై గవర్నర్ నిర్మాణాత్మక సూచనలు చేశారన్నారు. ఆ సూచనలను పాజిటివ్ దృక్పథంతో స్వీకరించి ఎన్నికలను విజయవంతం చేయాలని భావిస్తున్నామని రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆదిత్యానాథ్ దాస్తో వ్యక్తిగతంగా తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు.

