ఖిల్లా, ఏప్రిల్ 22 : ప్రస్తుతం జిల్లాలో సెకండ్వేవ్ కొవిడ్ విజృంభిస్తున్నందున ప్రజలు ఇబ్బంది పడకుండా వైద్యశాఖ అధికారులు అప్ర మత్తంగా ఉండి వైద్య సేవలు అం దించాలని జిల్లా పరిషత్ చైర్మన్ దా దన్నగారి విఠల్రావు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశం హాల్లో వైద్య, విద్యశాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ పరీక్షలు, వైద్య సేవలపై ఆ శాఖ అధికారులను అడి గి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు వైద్య సేవలు అం దేవిధంగా కృషి చేయాలన్నారు. ఆక్సిజన్ కొరత ఉన్నట్లు త మ దృష్టికి వచ్చిందని కొరత లేకుండా అన్ని చర్యలు తీసు కోవాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.
2 వేలు, 25 కిలోల బియ్యం సకాలంలో అందించాలని ఆదేశించారు. కొవిడ్ చికిత్స ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని సహాయక ఏడీకి సూచించారు. రెమ్డెసివిర్ అమ్మకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం మహిళ, శిశు సంక్షేమశాఖలపై సమీక్ష నిర్వహించగా, పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో అధికారులు పాల్గొన్నారు.

