ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అనూహ్య విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీని రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా ఉనద్కత్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. కష్టాల్లో ఉన్న ఢిల్లీకి కెప్టెన్ రిషభ్ పంత్ (32 బంతుల్లో 51) అండగా నిలబడ్డాడు. పంత్తోపాటు లలిత్ యాదవ్ (20), టామ్ కర్రాన్ (21), క్రిస్ వోక్స్ (15) ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ 3, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2, క్రిస్ మోరిస్ ఒక వికెట్ తీసుకున్నారు.
148 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ను ఢిల్లీ బౌలర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు.

