Dailyhunt

రేషన్ లారీ పట్టివేత

కృష్ణా: జిల్లాలోని మైలవరంలో రేషన్ లోడ్‌తో ఉన్న లారీని పోలీసులు పట్టుకున్నారు.

విజయవాడ రోడ్‌లోని ఒక పెట్రోల్ బంక్ వద్ద లారీ ఆగి ఉంది. అనుమానం రావడంతో తన సిబ్బందితో కలిసి మైలవరం ఎస్ఐ రాంబాబు తనిఖీలు చేసాడు. ఈ తనిఖీల్లో రేషన్ బియ్యం దొరికాయి. లారీలో దాదాపు10 నుంచి15 టన్నులు బియ్యం ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. లారీని పోలీసులు స్టేషన్‌కి తరలించారు. లారీ డ్రైవర్, ఓనర్‌ను పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy