మానవ హక్కుల వేదిక కన్వీనర్ డిమాండ్
మొగల్తూరు, నవంబర్ 23: సముద్రానికి ఐదు వందల మీటర్ల పరిధిలోని కోస్టల్ రెగ్యులేటింగ్ జోన్(సీఆర్జడ్) భూములు మత్స్యకారులకే చెందాలని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కన్వీనర్ వీఎస్ కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. తీరంలో రహదారి విస్తరణ పేరుతోనూ, బీచ్ ఫెస్టివల్ పేరుతోనూ మత్స్యకారులు అనుభవిస్తున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజా సంఘాలు ఖండించాయి.
