అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎంను నాగార్జున కలిశారు. జగన్తో లంచ్ చేశారు.
కాగా ఇటీవల సినిమా పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ వివాదం నేపథ్యంలో రిలీజ్ కాలేదు. ఇటువంటి వివాదం పరిశ్రమకు, ప్రభుత్వానికి మంచిదికాదని.. ముఖ్యంగా పరిశ్రమ నష్టపోతుందని భావిస్తూ సీఎం జగన్తో చర్చించేందుకు నాగార్జున గురువారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.

