పుణే: పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంజరి పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న సీరం సంస్థకు చెందిన ఐదంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా భవన నిర్మాణ కార్మికులేననీ.. ఐదో అంతస్తులో వారి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మరో తొమ్మిది మందిని ఘటనా స్థలం నుంచి బయటికి తరలించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్విటర్లో స్పందిస్తూ... ''పుణే సీరం ఇన్స్టిట్యూట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా బాధించింది.

