హైదరాబాద్: ప్రగతి భవన్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారి నుంచి వివిధ డిపార్ట్మెంట్లలో సిబ్బంది కోసం దరఖాస్తులను ఆహ్వానించాలని సూచించారు. వరంగల్, ఆదిలాబాద్ రిమ్స్ లాంటి ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానాల్లో 7393 బెడ్లు, 2470 ఆక్సిజన్ బెడ్లు, 600 వెంటిలేటర్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని సీఎం కేసీఆర్కు అధికారులు తెలిపారు. సమీక్షకు ముందు కరోనా నియంత్రణపై తెలంగాణలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్తో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు.

