చెన్నై, మే 30: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం చోటుచేసుకుంది. అజిత్ తల్లి మోహిని కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం చెన్నైలోని ఇంట్లో తుదిశ్వాస విడిచారు.
అజిత్ తల్లి మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.
డైలీ తంతి తెలిపిన వివరాల మేరకు.. అజిత్ కుమార్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు. తల్లి మరణం నేపథ్యంలో ఆయన వెంటనే చెన్నై రానున్నారు. చెన్నైలోని పాలవాక్కమ్ ఇంటి దగ్గర మోహిని అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. అజిత్ తండ్రి సుబ్రమణ్యం 2023 మార్చి 24న చనిపోయారు. చనిపోయే నాటికి సుబ్రమణ్యం వయసు 84 సంవత్సరాలు.

