అనంతపురం వైద్యం, అక్టోబర్27: నగరంలోని 31వ డివిజనకు చెందిన జనసేన పార్టీ నాయకుడు అరుణ్బాషా టీడీపీలోకి చేరారు. నగరంలోని ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారుతిగౌడ్, నరసింహులు, సుంకన్న, ఎస్ఎం బాషా, పావురాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

