కడప: ఉపాధ్యాయుడు ధూషించాడని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కడప జిల్లా పుల్లంపేట ఆదర్శ పాఠశాల వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వద్ద లభించిన సూసైడ్ లేఖలో తనను తరగతి గదిలో ఉపాధ్యాయుడు దూషించినందుకు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.