Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉత్తరాంధ్రకు 'గులాబ్' భయం

ఉత్తరాంధ్రకు 'గులాబ్' భయం

విశాఖ: ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు ప్రమాదం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా మారి ఉత్తరాంధ్రలోని విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్‌ల మధ్య ఈనెల 26న తీరం దాటే అవకాశముంది.

ఈ తుపానుకు పాకిస్థాన్‌ పెట్టిన 'గులాబ్‌' అనే పేరును ఖరారుచేసే అవకాశాలున్నాయి. నిజానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి శుక్రవారం వాయుగుండంగా మారింది. సాయంత్రం 5.30 గంటలకు తూర్పు-మధ్య బంగాళాఖాతం మీదుగా ఉంది. గోపాలపుర్‌కు ఆగ్నేయంగా 670 కి.మీ దూరంలో, కళింగపట్నానికి తూర్పుగా 740 కి.మీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. శనివారం ఉదయానికి తుపానుగా మారొచ్చు. దీనితో ఈ నెల 27 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

 ఆర్మీ జవాన్ మృతి  స్టీల్ ప్లాంట్ అమ్మకం చరిత్రలోనే అతిపెద్ద స్కాం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy