Dailyhunt

వైద్య సేవలపై ఎమ్మెల్సీ కవిత సమీక్ష

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో వైద్య సేవలకు కావాల్సిన ఏ ర్పాట్లపై ఎమ్మెల్సీ కవిత దృష్టిపెట్టారు. జిల్లాలో నెల రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా పెరిగింది. కేసులు ఎక్కువ కావ డం, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి ఎక్కువ మంది వచ్చి చేరుతుండడంతో సౌకర్యాలపై దృష్టిపెట్టారు. మంత్రులతో జిల్లా ప్ర జాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ రోగులకు ఇబ్బందు లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యం కలెక్టర్‌ నారాయణరెడ్డి, వైద్య అధికారులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అత్యవసరమైన రెమ్‌డెసివిర్‌ మందులు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సిబ్బందికి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మందులు వచ్చేవిధంగా చూస్తున్నారు. పడకల సంఖ్య పెంపునకు కృషి చేయడంతో పా టు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులతో మాట్లాడుతూ చికిత్సకు అవసరమైన మందులు తెప్పిస్తున్నారు. రోజు సమీక్షి స్తూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారికి వైద్య సేవలు అందేవిధంగా చూస్తున్నారు. ఆమె గురువారం విలేకరులతో సెల్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా సేవలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. మందులు, ఆక్సిజన్‌, పడకలను సమకూరుస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎ ప్పటికప్పుడు సమీక్షిస్తూ మందులు అందేవిధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని మంత్రితో పాటు ప్రజాప్రతినిధులను సమన్వయంతో వైద్యసేవలు అందేవిధంగా చూస్తున్నామన్నారు. తమకు వైద్య సేవల కోసం ఫోన్‌చేసే వారందరికీ సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పా టు కరోనా నియంత్రణకు కృషి చేయాలని కోరారు. బయటకు వచ్చేవారు మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పా టించాలని అన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు ఆందోళన చెందకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే న యం అవుతుందని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy