నారాయణపేట: వంట గ్యాస్ డెలివరీ కీ ఎక్కువ డబ్బులు చెల్లించ వద్దని పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. గురువారం ఆయన నారాయణ పేట లో డోర్ డెలివరీ కోసం గ్యాస్ రీఫిల్స్ ను తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి విచారించారు. రసీదు మీద ఉన్న మొత్తం మాత్రమే వినియోగదారులు చెల్లించాలని చెప్పారు. చాలా మటుకు జనం గ్యాస్ డెలివరీ సమయంలో "ఎంత" అని డెలివరీ బాయ్ నే అడిగి , వాళ్ళు అడిగినంత ఇచ్చే అలవాటు చేసుకున్నారని చెప్పారు.
అక్రరాస్యులు సైతం రసీదు మీద ఎంత ఉంది చూడకుండా .. ఎంతివ్వాలి ఆని అడగటం ,ఆ తర్వాత అడిగినంత డబ్బు ఇవ్వటం పరిపాటి గా మారిందన్నారు. ఏ ఒక్క రూపాయి కూడా ఉత్తగానే రాదన్న విషయం ప్రతీ ఒక్కరూ గుర్తుంచు కోవాలి అని వివరించారు.

