Dailyhunt
వరంగల్ జిల్లాలో దారుణం

వరంగల్ జిల్లాలో దారుణం

రంగల్: బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై జితేందర్‌ కథనం ప్రకారం.. నెల్లికుదురు మండలంలోని ఓ గిరిజన తండాలో 13 ఏళ్ల బాలికపై ఏడాది క్రితం అదే తండాకు చెందిన బాలుడు లైంగికంగా లొంగదీసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న మరో ఇద్దరు బాలురు బాలికపై వేర్వేరు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించగా గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ క్రమంలో ముగ్గురు బాలురు లైంగికంగా వేధించారని బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాలికపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు సోమవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy