వరంగల్: బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై జితేందర్ కథనం ప్రకారం.. నెల్లికుదురు మండలంలోని ఓ గిరిజన తండాలో 13 ఏళ్ల బాలికపై ఏడాది క్రితం అదే తండాకు చెందిన బాలుడు లైంగికంగా లొంగదీసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న మరో ఇద్దరు బాలురు బాలికపై వేర్వేరు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించగా గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ క్రమంలో ముగ్గురు బాలురు లైంగికంగా వేధించారని బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాలికపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు సోమవారం రాత్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

