Dailyhunt
విజయసాయి వ్యాఖ్యల్లో నిజమెంతో డీజీపీ తేల్చాలి: టీడీపీ నేత

విజయసాయి వ్యాఖ్యల్లో నిజమెంతో డీజీపీ తేల్చాలి: టీడీపీ నేత

విజయవాడ: గంజాయి సాగు, రవాణాపై మాట్లాడానని తనకు నోటీసులిచ్చారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు. ఆధారాలు సేకరించాలంటూ నానా హంగామా సృష్టించారని చెప్పారు.

గంజాయి సాగుతో లోకేష్‌కు సంబంధం ఉందని విజయసాయి అన్నారని చెప్పారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో నిజమెంతో డీజీపీ తేల్చాలని డిమాండ్ చేశారు. ఏపీ డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని పవన్ అన్నారని చెప్పారు. పవన్‌కు నోటీసులిచ్చే ధైర్యం ఈ పోలీసులకు ఉందా?, దళిత నేతనని పోలీసులు తన ఇంటికి వచ్చారా? అని ప్రశ్నించారు. విజయసాయికి తక్షణమే నర్సీపట్నం సీఐ, విశాఖ డీజీపీ నోటీసులివ్వాలన్నారు. ఆధారాలు ఏమున్నాయో సేకరించాలన్నారు. ఏపీ నుంచే గంజాయి వస్తోందని తెలంగాణ పోలీసులు అన్నారని పేర్కొన్నారు. వారికి కూడా ఈ డీజీపీ నోటీసులిస్తారా? అని ప్రశ్నించారు.

 జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు: నాదెండ్ల మనోహర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy