Minor Assault: మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులకు అమెరికాలో పదేళ్ల జైలు శిక్ష విధించారు. గుజరాత్ కు చెందిన కవన్ కుమార్ పటేల్..
నెబ్రాస్కాలోని ఒహామాలో వారు హోటల్ సిబ్బందిగా పనిచేస్తున్నారు. గతేడాది ఓ మైనర్ బాలికపై వాళలు అఘాయిత్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం హ్యుమన్ ట్రాఫికింగ్ నిందితులకు అతడు డబ్బు చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో రుజువైంది.
2025 జనవరి 6న జరిగిన ఓ దొంగతనం కేసు విచారణ సందర్భంగా హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. హోమ్ ల్యాండ్ సెక్యురిటీ టాస్క్ ఫోర్స్, ఒహామా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి.. ‘అమెరికన్ ఇన్’ హోటల్లో బంధీలుగా ఉన్న ఇద్దరు మైనర్ బాలికలను రక్షించారు. వారిని విచారించగా.. కవన్ కుమార్ పటేల్ తో పాటు సుమిత్ చౌదరి, విశాల్ గోస్వామి చేసిన నేరం బయటపడింది. హోటల్ సిబ్బందిగా వ్యవహరిస్తున్నఈ ముగ్గురు.. లైంగిక సంబంధం పెట్టుకోవాలని హ్యుమన్ ట్రాఫికింగ్ నిందితులు ద్వారా తమపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు బాలికలు పోలీసులకు తెలియజేశారు. దీంతో ఈ నేరానికి పాల్పడ్డ కవన్ తోపాటు మరో ఇద్దరు భారతీయుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు.. దిల్లీ, ముంబయిలో పేలుళ్లకు కుట్ర.. 9 మంది అరెస్టు
హోటల్ సిబ్బందిగా ఉన్న ముగ్గురు భారతీయులు.. హ్యుమన్ ట్రాఫికింగ్ నేరస్తులను పది రోజులపాటు హోటల్ లోనే ఉండేందుకు అనుమతించారని దర్యాప్తులో తేలింది. ఇందుకు బదులుగా వారి వద్ద ఉన్న మైనర్ బాలికలను లైంగికంగా వాడుకునేలా అంగీకారం కుదుర్చుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠా సభ్యుల ఆదేశాలతో బాలికలకు గత్యంతరం లేకుండా పోయిందని అన్నారు. ఈ కేసుకు సంబంధించి మెుత్తం ఆరుగురు నిందితుల్ని కోర్టులో హాజరుపరచగా పదేళ్ల జైలు శిక్షను న్యాయస్థానం విధించిందని చెప్పుకొచ్చారు. కాగా, ఈ శిక్ష కాలం పూర్తైన తర్వాత ముగ్గురు భారతీయులు దేశ బహిష్కరణను ఎదుర్కోనున్నారు.

