Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీపై పోక్సో కేసు నమోదు

బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీపై పోక్సో కేసు నమోదు

Big TV Live 2 weeks ago

POCSO Case: బాస్కెట్ బాల్ నేషనల్ ప్లేయర్ పై లైంగిక దాడి కేసు నమోదైంది. బాధిత ప్లేయర్‌తో క్యాంప్‌లలో అసభ్యంగా అనుచితంగా ప్రవర్తించిన పృధ్వీశ్వర్ రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నేషనల్ బాస్కెట్ బాల్ టీం కి ఎంపికైన పృథ్వీశ్వర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ లో వరంగల్ నుంచి పోటీ చేసి గతంలో పృధ్వీశ్వర్ రెడ్డి గెలిచాడు. సబ్స్టిట్యూట్ ప్లేయర్గా పృథ్వి రెడ్డి ఆడాడు.

తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్‌..

అయితే ఇతడు హైదరాబాద్, నల్గొండ కాకుండా వరంగల్ నుంచి పోటీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు అసోసియేషన్ సభ్యులు కోర్టుకు వెళ్లారు. పృధ్వీశ్వర్ రెడ్డి ఎన్నిక చేల్లదంటూ కోర్టు పిటిషన్ దాఖలైంది. అయితే ప్రస్థుతం తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్‌లో జనరల్ సెక్రటరీగా పృధ్వీశ్వర్ రెడ్డి పనిచేస్తున్నాడు. జూనియర్ నేషనల్స్, అండర్ 16 నేషనల్స్ ఆడుతున్న క్రీడాకారిని ని లైంగికంగా సంవత్సరం నుంచి వేధింపులకు గురిచేసారంటూ అతని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read: క్షుద్రపూజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తెలంగాణ.. అజ్ఞాన ప్రదర్శనలో బిజీగా రెండు పార్టీలు!

పోక్సో కేసు..

తోటి క్రీడాకారిని క్యాంపుల పేరుతో సెలక్షన్ పేరుతో టోర్నమెంట్ల పేరుతో బయటికి వెళ్లినప్పుడు అక్కడ అనుచితంగా ఓ మహిళ ప్లేయర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వేధింపులు తాట్టుకోలేక కొన్ని సెలక్షన్స్ కి క్యాంపులకు కూడా తను వెళ్లలేకపోయానిన బాదిత బాలిక పేర్కోంది. దీంతో బాలిక మైనర్ కావడవడంతో పృధ్వీశ్వర్ రెడ్డిపై ఫోక్సో కేసు నమోదైంది. కేసు నమోదైనప్పటికి అతన్ని అరెస్టు చేయకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live