Brahmamudi : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీరియల్ జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది..
టైటిల్ కి తగ్గట్లుగానే ఒక జంటకి బ్రహ్మముడి పడితే ఆ జంట జన్మజన్మలకు విడిపోరని ఇందులో భార్య భర్తల బంధం గురించి చక్కగా వివరించారు. ఇందులో హీరోగా సీరియల్ హీరో మానస్ నటించిగా, హీరోయిన్ గా దీపికా రంగరాజ్ నటించారు. ఈ సీరియల్ లో మొదటగా విలన్ పాత్రలో రుద్రాణి నటించగా ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. కుటుంబాన్ని సంతోషంగా ఉంచకుండా తన స్వార్ధాన్ని చూసుకునే ఆ రుద్రాన్ని క్యారెక్టర్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. గత జన్మలో రుద్రాణి ఉండగా ఈ జన్మలో మాత్రం రేఖ అనే క్యారెక్టర్ ఈ జంటని ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న స్టోరీలో ఈమె విలన్.. ఈ పాత్రలో నటిస్తున్న నటి పేరు ప్రశాంతి.. అయితే నిన్న మొన్నటి వరకు ఈమె క్యారెక్టర్ హైలైట్ గా నిలిచింది.. సీరియల్ టాప్ లోకి వస్తుంది అనుకున్న సమయంలో రేఖ క్యారెక్టర్ ఇక కనిపించదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.. మరి నిజంగానే రేఖా అనే క్యారెక్టర్ సీరియల్ నుంచి తప్పకుంటుందా?లేదా?అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
‘బ్రహ్మముడి’ నుంచి రేఖ అవుట్..
స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. మొన్నటి వరకు బోరింగ్ గా ఉన్న ఈ సీరియల్ ఇప్పుడు రాజ్ ఇందుల పెళ్లి తర్వాత మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా మారింది.. వీళ్ళ పెళ్లి తర్వాత సీరియల్ స్టోరీ డిఫరెంట్ యాంగిల్ లోకి మారింది. ఇందులో ఆస్తి కోసం ఎన్నో ప్లాన్లు వేస్తున్న రేఖ ఎలాగైనా సరే ఆస్తిని దక్కించుకోవాలని అనుకుంటుంది.. తాను మాత్రమే ఈ ఆస్తి మొత్తాన్ని అనుభవించాలి అన్న కోరికతో ఉంటుంది రేఖ. అలాంటి పవర్ ఫుల్ రోల్ లో ఉన్న రేఖ ఇప్పుడు ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది.. ఆ వార్తల్లో నిజమేంత ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఇది అయితే బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారింది.. నిజానికి ఈ క్యారెక్టర్ లో నటిస్తున్న ప్రశాంతికి మరో బంపర్ ఆఫర్ వచ్చిందట.. దానివల్ల ఈ సీరియల్ చేయడం కుదరదు అనే ఉద్దేశంతోనే సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల్లో ఏది నిజమో తెలియదు కానీ.. వీటిపై క్లారిటీ రావాలి అంటే కచ్చితంగా ప్రశాంతి రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి..
Also Read :'పొదరిల్లు' మనీషా రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
రేఖ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
ఒకప్పుడు సినిమాలలో నటించిన హీరోయిన్లతో పాటుగా పలు క్యారెక్టర్ లో నటించిన ముద్దుగుమ్మలు కూడా ఇప్పుడు సీరియల్స్లలోకి ఎంటర్ అయిపోతున్నారు. సినిమాలతో రాని క్రేజ్ సీరియల్స్ కి రావడంతో ఎక్కువమంది బుల్లి తెరపైకి అడుగు పెడుతూ మరోసారి ప్రేక్షకులను తమ నటనతో ఆకట్టుకుంటున్నారు.. ఇప్పటికే ఎంతోమంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నారు. ప్రశాంతి ఒక్కరోజు రెమ్యూనరేషన్ దాదాపు 35 వేలకు పైగానే ఉంటుంది.. నెలలో 25 రోజులు సీరియల్స్ కి షూటింగ్ ఉంటుంది కాబట్టి లక్షల్లోనే ఈమె సంపాదిస్తూ వస్తుంది..

