Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big TV Live 1 week ago

Tree Felling: స్వేచ్చ బ్యూరో: దౌల్తాబాద్ మండల పరిధిలోని ముత్యంపేట గ్రామంలో చెరువు భూమిలో తుమ్మ చెట్ల నరికివేత వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామ సర్పంచ్ తొడంగి సునీత ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులోని తుమ్మ చెట్లను నరికి అక్రమాలకు పాల్పడ్డారని వార్డు సభ్యురాలు జంగం నవనీత ఆరోపించారు.

దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చెట్ల నరికివేతపై ప్రశ్నించిన తమపై సర్పంచ్, ఆయన కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. బుధవారం బాధితులు విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలోని ఒక చెరువులో ఆరు తుమ్మ చెట్లను నరికేందుకు మాత్రమే సంబంధిత అధికారుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే వేరే చెరువులో సుమారు వందకు పైగా తుమ్మ చెట్లను నరికి తరలించారని ఆరోపించారు.

ప్రశ్నిస్తే బెదిరింపులు..

గ్రామ ప్రజల ఆస్తిగా ఉన్న చెరువులో భారీ ఎత్తున చెట్ల నరికివేత జరిగినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. చెట్ల నరికివేతపై గ్రామస్థులు ప్రశ్నించగా, సర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మాట్లాడుకుందాం అంటూ పిలిచి అక్కడ తమపై దాడి చేశారని వార్డు సభ్యురాలు జంగం నవనీత తెలిపారు. ప్రజాప్రతినిధిగా గ్రామ ఆస్తుల పరిరక్షణ గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి దాడులకు దిగడం బాధాకరమన్నారు. అంతేకాకుండా ఘటన సమయంలో తమ సెల్‌ఫోన్లను లాక్కొని వీడియోలు, ఫొటోలు తీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సర్పంచ్ భర్తతో కలిసి తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని, గ్రామంలో ఎవరు ప్రశ్నించినా కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారని వాపోయారు.

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

అటవీ శాఖ అధికారులు..

ఇక చెట్ల నరికివేతపై అభ్యంతరం వ్యక్తం చేసిన యువకులపైనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేసి ఒత్తిడి తీసుకువస్తున్నారని బాధితులు ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కును కాలరాస్తూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత ఇరిగేషన్,రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి చెట్ల నరికివేతకు సంబంధించిన అనుమతులు, నరికిన చెట్ల సంఖ్య, వాటి తరలింపు వివరాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. అలాగే తమపై జరిగిన దాడి ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంగం స్వామి,తొడంగి స్వామి,తొడంగి రాజు,తొడంగి ఆంజనేయులు,గడ్డమీది రమేష్, జంగం బాలయ్య ,గడ్డమీది శ్రీకాంత్ పంచం శ్రీను ,జంగం ముత్యం తొడంగి అనిల్, ముత్యాల రాజయ్య తదితరులున్నారు.

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live