NTR Dragon: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో జూనియర్ ఎన్టీఆర్, 'KGF' ఫేమ్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.
ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, తారక్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా చిత్ర యూనిట్ ఒక భారీ సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తోంది.
Read also-18 ఏళ్ల యువకుడితో యవ్వారం నడిపే స్కూల్ టీచర్… రచ్చ రంబోలా సీన్లు ఉన్న సినిమా మావా
ముంబైలో గ్రాండ్ ఈవెంట్?
ఈ సినిమా ప్రమోషన్లను పాన్-ఇండియా స్థాయిలో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. ఇందులో భాగంగా, ముంబైలో ఒక ప్రత్యేక ఈవెంట్ను నిర్వహించి, అక్కడి మీడియా సమక్షంలో సినిమా ‘ఫస్ట్ గ్లింప్స్’ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ స్వయంగా ఈ ఈవెంట్లో పాల్గొనే అవకాశం ఉంది.
గ్లింప్స్ విశేషాలు
మే 19 అర్ధరాత్రి (అంటే మే 20 మొదలయ్యే సమయంలో) గ్లింప్స్ విడుదల కానుంది. ఇది సాధారణ టీజర్లా కాకుండా, సుమారు 3 నిమిషాల నిడివితో ఉండే ‘వరల్డ్ బిల్డింగ్’ వీడియో అని సమాచారం. అంటే ప్రశాంత్ నీల్ సృష్టించిన ఈ సినిమా నేపథ్యం ప్రపంచం ఎలా ఉంటుందో ఇందులో వివరంగా చూపించనున్నారు. చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ‘డ్రాగన్’ (Dragon) అనే టైటిల్ను ఈ గ్లింప్స్ ద్వారా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Read also-సైనికుడి మాయలో నియంత… కేట్ విన్స్లెట్ కెరీర్ లోనే విభిన్నమైన పొలిటికల్ సెటైర్ వెబ్ సిరీస్
రహస్యంగా ఉంచిన టీజర్
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ గ్లింప్స్ను అత్యంత గోప్యంగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సినిమా యూనిట్లోని కీలక సభ్యులకు కూడా ఇది ఇంకా చూపించలేదని, లీక్లు కాకుండా జాగ్రత్త పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఇప్పటికే దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులను పూర్తి చేసినట్లు సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో అనిల్ కపూర్, రుక్మిణి వసంత్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నరు. తారక్ అభిమానులు ఈ మే 20 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే ‘దేవర’ విజయం తర్వాత తారక్ నుంచి రాబోతున్న మరో భారీ యాక్షన్ చిత్రం ఇదే!

