Inzamam-ul-Haq: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) లాంటి దిగ్గత క్రికెటర్ల పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అంటేనే మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా కేకేఆర్ పై సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq) హాట్ కామెంట్స్ చేశారు. ఇండియాలో ఉన్న ముస్లింలందరూ విరాట్ కోహ్లీని బాయ్ కాట్ ( boycott Virat Kohli) చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ముస్లింలకు మంచి జరుగుతుందని తెలిపారు. హిందూ దేవుళ్లను కొలిచే, క్రికెటర్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ఇంజమామ్. దీంతో ఇంజమామ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
విరాట్ కోహ్లీని భారతీయ ముస్లింలు బాయ్ కాట్ చేయండి
విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్యూర్ హిందువు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా హిందూ దేవుళ్లను కొలుస్తూ ఉంటారు. లండన్ లో నివాసం ఉంటున్న ఈ జంట… ఇండియాకు వస్తే కచ్చితంగా గుళ్లు గోపురాలకు తిరుగుతూ ఉంటారు. స్వామీజీల వద్దకు కూడా వెళ్లి ఆశీర్వాదాలు తీసుకుంటారు విరాట్ కోహ్లీ దంపతులు. అయితే అలాంటి విరాట్ కోహ్లీ పైన ఇంజమామ్-ఉల్-హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బండల రూపంలో ఉన్న హిందూ దేవుళ్లను కొలిచే విరాట్ కోహ్లీని ఇండియన్ ముస్లింలు బాయ్ కాట్ చేయాలని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. హిందు జాతికి సంబంధించిన క్రికెటర్లను భారతీయ ముస్లింలు ఎంకరేజ్ చేయకూడదని డిమాండ్ చేశారు.
అల్లా ప్రకారం తాను చెప్పినట్లు ఇండియాకు సంబంధించిన ముస్లింలు మెదగాలని పిలుపునిచ్చారు. అయితే దీనిపై ఇండియన్ ముస్లింలు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇండియాలో చిచ్చుపెట్టేందుకు ఇంజమామ్-ఉల్-హక్ లాంటి చిల్లర గాళ్లు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో హిందూ ముస్లిం భాయ్ – భాయ్ అన్నట్లుగానే వ్యవహారం ఉంటుందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని చిత్లు పెట్టినా, విరాట్ కోహ్లీని ఆరాధిస్తూనే ఉంటామని ఇండియాకు సంబంధించిన ముస్లిం సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
విరాట్ కోహ్లీ సెంచరీపై కూడా విమర్శలు
కేకేఆర్ పై బుధవారం విరాట్ కోహ్లీ 58 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విక్టరీ అందుకుంది. అయితే దీనిపై కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు ఇంజమాం. 58 బంతుల్లో సెంచరీ చేయడం కూడా పెద్ద ఘనత అన్నట్లుగా కోహ్లీ ఫీల్ అవుతున్నాడని పరువు తీశారు. అదే 58 బంతులు నేను ఆడి ఉంటే.. డబుల్ సెంచరీ చేసే వాడిని వ్యాఖ్యానించారు.

