Delhi: అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతారని చెబుతారు. పైన కనిపిస్తున్న ఢిల్లీలోని ఓ మహిళ విషయంలో అదే జరిగింది. లాటరీలో ఏకంగా రూ.65 గెలుచుకుంది.
తనకు లాటరీ పలకడంతో సదరు మహిళ ఉబ్బితబ్బిబ్బై పోతోంది. ఇంతకీ ఆ లాటరీ ఏంటి? ఇటీవల దేశంలోని చాలామంది వ్యక్తులకు లాటరీ ద్వారా లక్ష్మిదేవి తలుపు తడుతోంది.
లాటరీలో ఢిల్లీ మహిళకు జాక్పాట్: అబుదాబిలో జాక్పాట్ కొట్టింది భారతీయ మహిళ. ఏకంగా రూ. 62 కోట్ల లాటరీని గెలుచుకుంది సదరు మహిళ. ఢిల్లీకి చెందిన కనికా అరోరా అనే గృహిణి లాటరీలో రూ. 62 కోట్ల ప్రైజ్మనీ వరించింది. అబుదాబిలో నిత్యం లాటరీ నిర్వహిస్తారు. బిగ్ టికెట్ సిరీస్లో భాగంగా ప్రతీ నెల లాటరీ టికెట్ కొనుగోలు చేసింది ఆ మహిళ. జూన్ 30న జరిగిన లాటరీలో 25 మిలియన్ దిర్హమ్ ఆమెని వరించింది.
సోషల్ మీడియా ద్వారా టికెట్ కొనుగోలు: కనికా అరోరా ఫ్యామిలీ ఢిల్లీకి చెందినది. గత కొన్నాళ్లుగా ఢిల్లీలో ఉంటున్నారు. ఆమె భర్త యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా లాటరీ గురించి తెలుసుకుంది. కొన్నేళ్లు తర్వాత అరోరా బిగ్ టికెట్ కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా టికెట్ను కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో డబ్బులు పోయాయనుకోండి అదే వేరే విషయం.
మా కల సాకారం అయ్యిందంటూ ఆనందం: ఈ విధంగా లాటరీ టికెట్ల కొనుగోలు చేయడం ప్రమాదకరమని తెలిసినప్పటికీ ప్రతీ నెలా కొనుగోలు చూస్తూనే వచ్చింది. ఇన్నాళ్లకు మా కల సాకారమైందని ఆనందంతో చెప్పింది అరోరా. లాటరీలో బహుమతి గెలిస్తే వచ్చిన మొత్తాన్ని ఏం చేయాలో అన్నదానిపై భర్తతో నిత్యం మాట్లాడినట్టు తెలిపింది.
అయోధ్యలో మరో ఇంజినీరింగ్ మార్వెల్.. ADA భవనంలో కూలిన మెట్లు.. తృటిలో తప్పిన ముప్పు!
అనుకోకుండా లాటరీ గెలవడంతో ఏమి చెయ్యాలో తెలియలేదని తెలియజేసింది. ప్రతీ ఒక్కరూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని, మన కల ఎలా నిజమౌతుందో చెప్పలేమని మనసులోని మాటను బయటపెట్టింది అరోరా.లాటరీలో వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కొనుగోలు చేస్తామని అరోరా తెలిపింది. మిగతా డబ్బుతో కూతురుకి చదువు, భవిష్యత్తుకు ఉపయోగిస్తామని వెల్లడించింది.

