Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది' టికెట్ రేట్ల పెంపు.. ప్రత్యేక షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

'పెద్ది' టికెట్ రేట్ల పెంపు.. ప్రత్యేక షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Big TV Live 1 month ago

Ram Charan Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా మేకర్స్‌కు మరియు మెగా అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు, స్పెషల్ ప్రీమియర్ షోలు, రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇస్తూ ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారికంగా జీవో విడుదల చేశారు.

Read also-సినీ ప్రపంచంలో విషాదం.. నటుడు, యూట్యూబ్ స్టార్ ఆరోగ్య సమస్యలతో కన్నుమూత..

స్పెషల్ ప్రీమియర్ షోలు

సినిమా అధికారికంగా విడుదల కావడానికి ఒక రోజు ముందే, అంటే జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుండి ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను జీఎస్టీతో కలిపి గరిష్టంగా రూ. 600 గా నిర్ణయించారు.

మొదటి వారం టికెట్ ధరల పెంపు (జూన్ 4 నుండి జూన్ 10)

సినిమా విడుదల రోజు (జూన్ 4) నుండి మొదటి వారం రోజుల పాటు సాధారణ టికెట్ ధరలపై అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో: ప్రస్తుతమున్న ధరలపై అదనంగా రూ. 100 పెంచుకోవచ్చు.

మల్టీప్లెక్స్‌లలో: ప్రస్తుతమున్న ధరలపై అదనంగా రూ. 125 పెంచుకోవచ్చు.

Read also-Brahmamudi Serial Today Episode May 29th 'బ్రహ్మముడి' సీరియల్‌: గోల్డ్ చైన్ తిరిగి తీసుకొచ్చిన రాజు

రోజుకు 5 షోలు

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి వసూళ్లు సాఫీగా సాగేందుకు వీలుగా, రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు మేకర్స్‌కు ప్రత్యేక అనుమతి లభించింది.

విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో, 1980ల నాటి రూరల్ స్పోర్ట్స్ (క్రికెట్, కుస్తీ) నేపథ్యంలో సాగే ఈ రా అండ్ రస్టిక్ ఎమోషనల్ డ్రామాకు ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో మే 30 నుండి ప్రారంభం కాబోయే అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'పెద్ది' సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 4న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live