Podarillu Manisha : ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి. బుల్లితెర ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ స్టోరీ రోజురోజుకీ జనాలని కనెక్ట్ ఎలా చేస్తుంది..
ఇందులో నటించే ప్రతి క్యారెక్టర్ వెనకాల ఎన్నో ఎమోషన్స్ ఎఫెక్షన్స్ ఉంటాయి. ఒక్కో క్యారెక్టర్ ఒక్కో విధమైన స్టోరీ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ప్రతి ఏడాది డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమైన ఈ సీరియల్ ప్రస్తుతం మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇందులో హీరో హీరోయిన్లు క్యారెక్టర్ తర్వాత మాధవ్ క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది. అన్నగా తమ్ముళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకునే పాత్రలో మాధవ్ నటిస్తున్నాడు. మాధవ్ క్యారెక్టర్ లో నటిస్తున్న వ్యక్తి అసలు పేరు అజయ్ సత్యనారాయణ. ఈయన గురించి అందరికి తెలిసే ఉంటుంది.. మొన్నటి వరకు మాధవ్ కి జోడిగా గాయత్రి నటించింది.. ఇప్పుడు గాయత్రికి పెళ్లవడంతో మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె రియల్ లైఫ్ ఏంటి? ఒక్క రోజుకి ఈ ముద్దుగుమ్మ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
మనీషా రియల్ లైఫ్..
పొదరిల్లు సీరియల్ లో మాధవ్ క్యారెక్టర్ జనాలకి విపరీతంగా నచ్చేసింది. ఇందులో నటించిన అదే సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గరయ్యారు. గతంలో ఈయన నువ్వు నేను ప్రేమ అనే సీరియల్ లో నటించారు. రెండవ సీరియల్ తో మరోసారి తన ఇమేజ్ ని పెంచుకున్నారు.. గతంలో చేసిన సీరియల్తో పోలిస్తే ఇప్పుడు చేసిన ఈ సీరియల్ జనాలని బాగా ఆకట్టుకుంటుంది.. పెద్దోడుగా తన బాధ్యతలని నిర్వర్తిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఈ సీరియల్ లో తన అత్త కూతురైన గాయత్రి ని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. కానీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితుల కారణంగా, గొడవల కారణంగా వాళ్ళ ప్రేమ దూరమవుతుంది.. గాయత్రి దూరమైన సరే తన కుటుంబాన్ని ఎక్కడ విడిచిపెట్టకుండా మాధవ్ తన పని ఏంటో తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక మాధవ్ కి జోడిగా ఏ అమ్మాయి వస్తుందని జనాలు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.. ఒక కొత్త అమ్మాయి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఆ అమ్మాయి పేరు మనిషా.. మాధవ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న బన్సీ బాయ్ కి స్వయానా చెల్లెలు.. వీరిద్దరి చూపులు చూస్తుంటే త్వరలోనే ప్రేమలో పడేలా కనిపిస్తున్నారు.. ఈ పాత్రలో నటిస్తున్న మనిషా అసలు పేరు సుస్మిత.. తెలుగులో ఇదే ఈమెకు మొదటి సీరియల్. హీరోయిన్ ని మించిన అందంతో జనాలని ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ముద్దుగుమ్మ గురించి తెలుసుకునేందుకు గూగుల్లో తెగ వెతికిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా ఈ అమ్మడికి ఎంత క్రేజ్ వస్తుందో చూడాలి..
మనీషా ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
ప్రస్తుతం తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో పోతురీలు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. డిఫరెంట్ స్టోరీ తో మొదలైన ఈ సీరియల్ ప్రస్తుతం జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఇందులో మాధవ్ కి జోడీగా కొత్త అమ్మాయి మనీషా ఎంట్రీ ఇచ్చింది. ఈమె అసలు పేరు సుస్మిత. బెంగాలీ ముద్దుగుమ్మ ఆయన ఈమె తెలుగులో ఇదే మొదటి సీరియల్. హీరోయిన్ మించిన అందం, తన అమాయకపు చూపులతో కుర్రకారు మతిపోగొట్టేస్తుంది.. ఈమె మొదటి సీరియల్ అయినా కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని తెలుస్తుంది. ఒక్క రోజుకి గాను దాదాపు 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈమె నెలకు లక్షల్లోని సంపాదిస్తూ తెలుగులో మంచి క్రియలు అందుకుంటుంది అని జనాలు అభిప్రాయపడుతున్నారు.

