Tamilnadu Politics: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గవర్నర్ను విజయ్ కలవకుండానే మద్దతు ప్రయత్నాలు వేగవంతం చేసింది ఆ పార్టీ.
బుధవారం సమావేశమైన తమిళనాడు కాంగ్రెస్ యూనిట్, టీవీకే ప్రభుత్వానికి మద్దతు విషయమై చర్చించింది. నేతలంతా ఓకే చెప్పేశారు. టీవీకేకు మద్దతు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేశారు ఏఐసీసీ తమిళనాడు ఇన్చార్జ్ గిరీష్ చోడంకర్.
తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వేలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ కేవలం 10 సీట్ల దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నారు టీవీకే చీఫ్ విజయ్.
తొలుత కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగించారు. టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు తెలపడం, ఈపై లేఖ విడుదల చేయడం చకచకా జరిగిపోయింది. మతతత్వ శక్తులను దూరంగా ఉంచాలనే ప్రధాన లక్ష్యంతో మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో లౌకిక, అభ్యుదయ, సంక్షేమ ప్రభుత్వాన్ని అందించడమే ప్రజా తీర్పు ఉద్దేశమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
కాంగ్రెస్-టీవీకే పొత్తు, రానున్న రోజుల్లో కలిసే అడుగులు
కేవలం ప్రభుత్వం ఏర్పాటుకే కాకుండా, భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలు, లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లో టీవీకేతో కలిసి పని చేస్తామని స్పష్టం చేసింది. ఈ లెక్కన రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలు కలిసి అడుగులు వేయనున్నాయి.
మరోవైపు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామినితో టీవీకే నేత ఆనంద్ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన నివాసం నుంచి విజయ్ నివాసానికి బయలుదేరి వెళ్లారు ఆనంద్. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలపాలని పళనిస్వామిని కోరినట్లు సమాచారం. ఇదిలావుండగా విజయ్కు మద్దతు ఇచ్చేందుకు అన్నాడీఎంకే మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు.
బెంగాల్లో హింస-విధ్వంసం.. విగ్రహాలు ధ్వంసం, ఆఫీసులకు నిప్పు, ఈసీ ఆదేశాలతో అధికారులు
చెన్నైలోని సీవీ షణ్ముగం ఆఫీసులో 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వీరంతా విజయ్కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ 47 స్థానాలు దక్కించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని గవర్నర్ను కలవనున్నారు టీవీకే అధినేత విజయ్.

