Tadikallu festival: స్వేచ్ఛ బ్యూరో: ఈనెల 24న 'టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్పీరియమ్' తాటి కల్లు మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గురువారం తాటి కల్లు మేళాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాటి నీరా బాటిల్ లను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు.
చిలుకూరు బాలాజీ రూట్ లో రాందేవ్ 150 ఎకరాల్లో 500 కోట్లతో ఎక్స్ పీరియం పార్క్ ఏర్పాటు చేశారన్నారు. వివిధ దేశాల నుంచి తెచ్చిన 500 తాటి చెట్లు 10 కోట్లతో చెట్లను ఎక్స్ పీరియం పార్క్ లో ఏర్పాటు చేస్తున్నారన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనల మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా తాటిమేళాలో పాల్గొనాలని కోరారు. కల్లు ఆరోగ్యానికి మంచిది.. మేజర్ హోటల్ లలో కూడా అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు.
తెలంగాణ డ్రింక్ గా తాటి కల్లు చేయడానికి ప్రభుత్వంలో చర్చిస్తామన్నారు. తాటి కల్లు ప్రకృతి రీత్యా దొరుకుతుంది.. ఆరోగ్యానికి చాలా మంచిది.. సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయన్నారు. తాటి ఈత వనాలు పెంచుకునే వారు మే 24 వ తేదీన జరిగే 'టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్పీరియమ్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈజీఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా తాటి ఈత వనాలు నాటి పెంచుతున్నామన్నారు. గ్రామాల్లో నర్సరీ లలో తాటి ఈత మొక్కలు పెంచాలని, కిడ్నీ లో రాళ్ళు వచ్చిన కల్లుతాగితే పోయన్నారు. మనసు ఉల్లాసానికి, ఆరోగ్యానికి తాటి కల్లు అమృతం లాగా పని చేస్తుందన్నారు. గీతావృత్తి బతకాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. నేచర్ కాపాడాలి.. అని కోరారు.

