Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాలకు వరుణుడి ముప్పు.. దూసుకొస్తున్న వర్షాలు.. రాబోయే రెండు రోజులు జాగ్రత్త సుమా!

తెలుగు రాష్ట్రాలకు వరుణుడి ముప్పు.. దూసుకొస్తున్న వర్షాలు.. రాబోయే రెండు రోజులు జాగ్రత్త సుమా!

Big TV Live 2 weeks ago

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభిస్తుందని ఆనందించే లోపే, వాతావరణ శాఖ (IMD) ప్రజలను అప్రమత్తం చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజులు వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎల్లుండి ఆ జిల్లాల్లో వాన దంచికొట్టే అవకాశం!
ప్రస్తుత వాతావరణ సూచనల ప్రకారం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉండగా, ఎల్లుండి (బుధవారం) నాటికి వర్షాల తీవ్రత పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ జిల్లాల ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ఏపీలోనూ అల్పపీడన సెగ..
మరోవైపు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా గట్టిగానే చూపిస్తోంది. దీని కారణంగా ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో ఆకాశం మబ్బుపట్టి ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అలాగే పల్నాడు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లోని వ్యవసాయదారులు అప్రమత్తంగా ఉండి, తమ పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

సముద్రం అల్లకల్లోలం.. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు వార్నింగ్!
అల్పపీడనం మరింత బలపడుతుండటంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం బాగా అల్లకల్లోలంగా మారే సూచనలు కనిపిస్తుండటంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. తీర ప్రాంత ప్రజలు కూడా తీరానికి దూరంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని స్థానిక యంత్రాంగం హెచ్చరిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live