Virender Sehwag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 50 కి పైగా మ్యాచులు ఫినిష్ అయ్యాయి. అయితే ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ప్రీమియర్ లీ 2026 టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఎలిమినేట్ అయింది. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) చెత్త కెప్టెన్సీ, ఇతర ఆటగాళ్ల ప్రదర్శన సరిగ్గా లేకపోవడం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. అయితే ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ కావడంపై తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఒక్కడు కూడా సరిగ్గా లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా హార్దిక్ పాండ్యాను తప్పించి కొత్త వాళ్లకు కెప్టెన్సీ ఇవ్వాలని సూచనలు చేశారు వీరేంద్ర సెహ్వాగ్. ఈ క్రమంలోనే ముంబై బౌలర్ బుమ్రాను అవమానించారు.
Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడరాదు..త్వరగా ఔట్ చేయండి, వాడు మళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు
బుమ్రాను అవమానించిన వీరేంద్ర సెహ్వాగ్..చుమ్రా అంటూ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ హాట్ కామెంట్స్ చేశారు. ముంబై ఇండియన్స్ లో తోపు ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఓడిపోతున్నారని ఆశ్రయించారు. హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్ లాంటి తోపు బౌలర్లు ఉన్నప్పటికీ విరాళంగా పరుగులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బుమ్రాను కాస్త చుమ్రా అంటూ అవమానించాడు వీరేంద్ర సెహ్వాగ్. హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, చుమ్రా ఉన్నాడంటూ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్.
ఆ తర్వాత అలర్ట్ అయిన వీరేంద్ర సెహ్వాగ్, చుమ్రాను కాస్త బుమ్రా చేసేసారు. అప్పటికే ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో… వీరేంద్ర సెహ్వాగ్ పై బుమ్రా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రాను కావాలనే వీరేంద్ర సెహ్వాగ్ అవమానించాడని మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బుమ్రాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల క్రికెట్ అనుభవం ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ ఇలా మాట్లాడటం విచారకరం అంటూ మండిపడుతున్నారు.
నేడు పంజాబ్ తో ముంబై ఇండియన్స్ మ్యాచ్
ముంబై ఇండియన్స్ ( Mumbai indians) వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్… పరువు కోసమైనా గెలవాలన్న కసితో బరిలోకి దిగుతోంది. అటు హార్దిక్ పాండ్యా ను మరోసారి ముంబై యాజమాన్యం తప్పించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో సూర్య భాయ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ బరిలో ఉంటాడు.

