Yashmi Gowda : తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న కన్నడ ముద్దుగుమ్మలలో యష్మి గౌడ ఒకరు.. కృష్ణ ముకుందా మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది..
ఒక్క సీరియల్ తోనే తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఈ సీరియల్స్ తర్వాత పెద్దగా సీరియల్స్ వాళ్ళు నటించలేదు కానీ తనకున్న సోషల్ మీడియా క్రేజ్ తో బి గ్ బాస్ లోకి అడుగుపెట్టి ఆడియన్స్ తో ట్రోల్ వేయించుకుంది.. కానీ తన ఆట తీరుతో, మాట తీరుతో కొంతమంది ప్రేక్షకులు యష్మీకి బాగా సపోర్ట్ చేశారు.. అయితే హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ సీరియల్స్ తో బిజీ అవుతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఆమె పరిస్థితి ప్రస్తుతం రివర్స్ పొజిషన్లో ఉంది. ఇంతవరకు ఏ సీరియల్ లో నటించినట్లు కనిపించలేదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అయితే యశ్మీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ వార్తలు గుప్పుమన్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
యష్మీ పెళ్లి ఫిక్స్..?
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలకు తెలుగులో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య ఏ సీరియల్ చూసినా కూడా కన్నడి అమ్మాయిలు మాత్రమే కనిపిస్తున్నారు. అలాంటివాళ్లు యష్మి గౌడ ఒకరు. ఈమె స్టార్ మా లో ప్రసారమైన స్వాతి చినుకులు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన ప్రియుడ్ని సొంతం చేసుకోవాలి అనే ఆశతో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది కానీ చివరికి ఆమె ఆశలు ఫలించవు. అయితే ఈ సీరియల్ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వినిపించాయి. వాటిపై ఎక్కడ ఈ అమ్మడు రియాక్ట్ అవలేదు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. తన తండ్రి సెలెక్ట్ చేసిన ఒక బిజినెస్ మాన్ తో ఈమె పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. అయితే ఇది కేవలం పుకార్లు మాత్రమే అని అనిపిస్తుంది.. మరి నిజంగానే ఈమె పెళ్లి పీటలు ఎక్క పోతుందా లేదా అన్నది తెలియాలంటే యశ్మీ గౌతమ్ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..
యష్మీ ఇప్పుడేం చేస్తుంది..?
తెలుగులోకి ఈ బ్యూటీ స్వాతి చినుకులు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సీరియల్లో అమాయకమైన హీరోయిన్ పాత్రలో కనిపించిన యష్మీ. కృష్ణ ముకుంద మురారీ సీరియల్ లో నటించి మెప్పించింది.. బుల్లితెర పై ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేస్తుంది యష్మీ . ప్రస్తుతం తెలుగులో సీరియల్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.. అంతే కాదు ఆహాలో ప్రసారం అవుతున్న కుకు విత్ జాతి రత్నాలు లో తన అద్భుతమైన వంటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..

