Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'డ్రాగన్'.. 24 గంటల్లోనే ఆల్‌టైమ్ రికార్డ్!

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'డ్రాగన్'.. 24 గంటల్లోనే ఆల్‌టైమ్ రికార్డ్!

Big TV Live 3 days ago

NTR Dragon: యంగ్ టైగర్ ఎన్టీఆర్, 'కేజీఎఫ్' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' (DRAGON).

ఇటీవల విడుదలైన ఈ సినిమా అఫీషియల్ గ్లింప్స్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. రిలీజైన క్షణం నుంచే సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ గ్లింప్స్, ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డులను లిఖించింది.

Read also-Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి టెన్షన్ పెట్టిన సుకన్య.. ఆస్తి కోసం ప్రతాప్ రచ్చ.. రామరాజు గుండెలు పగిలే సీన్..

24 గంటల్లోనే 64 మిలియన్ల వ్యూస్!

ఈ సినిమా గ్లింప్స్ విడుదలైన 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా (6.4 కోట్లు) వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. తద్వారా భారతీయ చిత్ర పరిశ్రమలోనే "ఇండియాస్ మోస్ట్ వీవ్డ్ మూవీ గ్లింప్స్" గా నిలిచింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక పవర్‌ఫుల్ రికార్డ్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ రగ్గడ్ లుక్, బ్లాక్ బనియన్, సన్‌గ్లాసెస్‌తో ఊరమాస్ అవతారంలో కనిపిస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

డార్క్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఎన్టీఆర్

ఇప్పటివరకు 'NTRNeel' (NTR 31) అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి మేకర్స్ 'డ్రాగన్' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన 'లుగర్' అనే అత్యంత క్రూరమైన అసాసిన్ పాత్రలో నటిస్తున్నారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని 1967 బ్యాక్‌డ్రాప్‌లో, అంతర్జాతీయ ఓపియం (నల్లమందు) మాఫియా మరియు గ్లోబల్ వార్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ షేడ్స్‌తో కూడిన విజువల్స్, ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లాయి.

Read also-ఓటిటిలో ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న అదిరిపోయే సినిమాలు… యాక్షన్ థ్రిల్లర్ నుంచి హారర్ వరకు

భారీ తారాగణం..

ఈ పాన్-ఇండియా చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ 'రఘువీర్ రాథోడ్' గా నటిస్తుండగా, రుక్మిణీ వసంత్, బిజు మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక విభాగంలో 'KGF' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, భువన్ గౌడ అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను జూన్ 11, 2027 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్లింప్స్ క్రియేట్ చేసిన విధ్వంసంతో, బాక్సాఫీస్ వద్ద 'డ్రాగన్' ఎలాంటి వసూళ్ల సునామీ సృష్టిస్తుందోనని సినీ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live