Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. నెల్సన్ సినిమా లేనట్టేనా

ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. నెల్సన్ సినిమా లేనట్టేనా

Chitrajyothy 1 week ago

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), క్రేజీ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా డ్రాగన్. కన్నడ క్రష్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా, సినిమా స్థాయిని మరింత పెంచేసింది. వచ్చే ఏడాది జూన్ 11వ తేదీన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ సరికొత్త లుక్, ప్రశాంత్ నీల్ టేకింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ తదుపరి చిత్రాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ చిత్రం ఏకంగా 2028వ సంవత్సరానికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. ఈ ప్రాజెక్ట్ ఇంతలా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం దర్శకుడు నెల్సన్ ప్రస్తుత కమిట్‌మెంట్స్ అని చెప్పాలి. ఆయన ప్రస్తుతం సూపర్ హిట్ జైలర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న జైలర్ 2 పనుల్లో ఎంతో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా పనులను వీలైనంత త్వరగా ముగించిన వెంటనే, కోలీవుడ్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అరుదైన చిత్రానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారట.

సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కలయికలో ఒక మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించేందుకు ఆయన ఒక భారీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు లెజెండ్రీ నటులను ఒకే స్క్రీన్‌పై చూపించడం కోసం నెల్సన్ పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా డ్రాగన్ షూటింగ్ పూర్తయిన వెంటనే అస్సలు గ్యాప్ తీసుకోకుండా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ అనే ప్రతిష్టాత్మక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం ఎన్టీఆర్ తన కాల్షీట్లను కేటాయించారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చే ఈ సినిమా పూర్తయ్యే లోపు, అటు దర్శకుడు నెల్సన్ కూడా రజనీకాంత్, కమల్ హాసన్ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ఒక పక్కా ప్లాన్‌తో భావిస్తున్నారు.

ఇక ఈ రెండు భారీ చిత్రాలు పూర్తిగా పూర్తవడానికి కనీసం రెండేళ్లకు పైగా సమయం పడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సమీకరణాలన్నింటినీ గమనిస్తే, ఎన్టీఆర్ - నెల్సన్ కాంబో చిత్రం 2028లోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు నిరీక్షించక తప్పదు. భవిష్యత్తులో ఈ ఇద్దరి కలయికలో సినిమా కచ్చితంగా వస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

ఇవి కూడా చదవండి:

Ravi Teja: ఆ పాత్రలో రవితేజ నిజమేనా.. అభిమానులు ఒప్పుకుంటారా?

KA13: గ్యాప్ ఇవ్వు అన్నా.. అప్పుడే ఇంకొకటా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy