ప్రముఖ సింగర్ మంగ్లీ (Singer Mangli) ని టార్గెట్ చేసుకొని కొన్ని యూ ట్యూబ్ చానెల్స్ అసభ్యకర పోస్టులు పెడుతున్నాయని ఆమె పర్సనల్ మేనేజర్ మేఘ్ రాజ్ ఆరోపించారు.
మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంగ్లీపై కొన్ని యూట్యూబ్ చానెల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆమెతో పాటు కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. బాధితులకు అండగా ఉంటానని మంగ్లీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆమెపై గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలని, త్వరలో నిజాలు తెలుస్తాయన్నారు. సమావేశంలో నవీన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

