Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Naga Vamsi: కంటెంట్‌ యాజమానులం.. ఎలా డ్యామేజీ చేయాలో తెలుసు..

Naga Vamsi: కంటెంట్‌ యాజమానులం.. ఎలా డ్యామేజీ చేయాలో తెలుసు..

Chitrajyothy 2 weeks ago

టాలీవుడ్‌ నిర్మాతలకు, ఎగ్జిబిటర్‌లకు మధ్య చాలాకాలంగా జరుగుతున్న రచ్చ గురించి తెలిసిందే! రెంటల్‌, పర్సంటేజ్‌ విధానంపై నడుస్తోన్న ఇష్యూ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

ఈ విషయంలో ఎక్కువగా వినిపించిన పేరు నిర్మాత నాగవంశీ (Naga vamsi). ఏషియన్‌ సినిమాస్‌ అధినేత సునీల్‌ నారంగ్‌ (Sunil Narang) ఈ వివాదంపై నేరుగా వంశీని టార్గెట్‌ చేశారు. వ్యక్తిగతంగా విమర్శించారు. అయినా నాగవంశీ కౌంటర్‌ ఇవ్వలేదు. ఏ విషయం మీదైనా వెంటనే స్పందించే వంశీ ఈ విషయంలో మాట్లాడకపోవడం కూడా టాక్‌ ఆప్‌ ది ఇండస్ట్రీగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ స్పందించారు. లెనిన్‌ (lenin) సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో 'టాలీవుడ్‌లో పెద్ద నిర్మాత మిమ్మల్ని పర్సనల్‌గా ఎటాక్‌ చేస్తే ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు' అని ప్రశ్నించగా సింపుల్‌గా, కూల్‌గా ఉంటూనే తనదైన స్టైల్లో ఎటాకింగ్‌గా సమాధానమిచ్చారు.

'గతంలో నాపై కామెంట్స్ చేసిన వ్యక్తి బాగా డబ్బున్న వారు కదా! ఏమైనా అంటారు' అని లైటర్‌ వేలో చెప్పి, 'మేం కంటెంట్‌ యాజమానులం. మేం చేయాల్సిన డామేజీ మేం చేస్తాం. ఎక్కడ చేస్తా ఎలా చేస్తాం అనేది చూడాలి. ఇది ఇవాల్టితో అయిపోయేది కాదు కదా? ప్రతి ఒక్కరికీ టైమ్‌ వస్తుంది. మాకూ టైమ్‌ వస్తుంది. వార్‌ మొన్నే మొదలైంది..' అంటూ సైలెంట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పర్సంటేజీ - రెంటల్‌ విధానంపై కూడా ఆయన స్ర్టెయిట్‌గా సమాధానమిచ్చారు. ఇదంతా ఎగ్జిబిటర్‌ అనేవాడు లేకుండా చేయాలని చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. అప్పులు తెచ్చి సినిమాలు తీసేది మోకాళ్ల మీద నిలబడి థియేటర్లు అడుక్కోవడానికా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిర్మాతలంతా ఒకే మాట మీద నిలబడాలి.

ఇకపై సినిమాల రిలీజ్‌ల విషయంలో జాగ్రత్త పడతామని, రెండు పెద్ద సినిమాల్ని ఒకే వారంలో విడుదల చేయకుండా చూసుకుంటామని చెప్పారు. అప్పుడు థియేటర్లకు ఫుటేజీ అవసరం అవుతుందని, అలాంటప్పుడు నిర్మాత మాటే చెల్ల్లుబాటు అవుతుంది అన్నట్లు ఆయన మాట్లాడారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy