తాజా వార్తలు
కస్టమ్స్ సేవలు ప్రశంసనీయం: తమిళిసై

హైదరాబాద్: కస్టమ్స్ విధులు నిర్వర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని గవర్నర్ తమిళిసై అన్నారు. బుధవారం హైదరాబాద్లోని నాంపల్లిలో జరిగిన అంతర్జాతీయ కస్టమ్ దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కరోనా సమయంలో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన విధులు ప్రశంసనీయమన్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్కు వెన్నెముకలా పని చేశారని అభినందించారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని అధికారులకు సూచించారు.
'హైదరాబాద్ ఫార్మా రంగానికి రాజధాని. 150 దేశాలకు హైడ్రో క్లోరోక్విన్ను మన దేశం నుంచి ఎగుమతి చేయడం గర్వకారణం. కొవిడ్ వ్యాక్సిన్ దేశంలో తయారవుతోంది. ఇక్కడ ఇవ్వడంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలకు టీకా సరఫరా చేస్తున్నాం. భారత్ సేవల్ని డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. వ్యాక్సిన్ను రూపొందించడమే కాకుండా ఇతర దేశాలకూ ఇస్తున్నాం. ఇది దేశానికి గర్వకారణమైన విషయం. ఇందులో భాగస్వాములమైన కస్టమ్స్ అధికారుల్ని అభినందిస్తున్నా' అని గవర్నర్ తమిళిసై అన్నారు.
ఇవీ చదవండి..
ఎర్రకోట ఘటనపై హోంశాఖ సీరియస్!
దిల్లీ అల్లర్లు.. 'దీప్ సిధు' పాత్రేంటీ?