ఇవాళ POCSO కేసు నిందితుడు బండి భగీరథ్ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. వారం రోజులపాటు కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు.
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఘాయిత్యాలు జరిగిన సమయంలో అక్కడే ఉన్న భగీరథ్ స్నేహితులను దాదాపు రెండు గంటలపాటు విచారించారు పోలీసులు. ఘటనలు జరిగిన సమయంలో ఆ ప్రదేశాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు, అక్కడ విధుల్లో ఉన్న వారిని కూడా పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.
ఈ నేపధ్యంలో భగీరథ్ను కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మల్కాజ్గిరి POCSO కోర్టులో భగీరథ్ కేసు విచారణ జరగుంది. నిన్న ములాఖాత్ ద్వారా భగీరథ్ను కలిసింది అతని తల్లి.
ఇవాళ POCSO కేసు నిందితుడు బండి భగీరథ్ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. వారం రోజులపాటు కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు.

