Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోం..విజయం మాదే!

ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోం..విజయం మాదే!

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) కొట్టిపారేసింది. ఎగ్జిట్ పోల్స్ అంకెలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, ప్రజల మద్దతు తమకే ఉందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేసింది.

పుదుచ్చేరిలోని నెల్లితోప్ నియోజకవర్గ టీవీకే అభ్యర్థి కేకే ఆనంద్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అస్సలు పట్టించుకోం. అవి కేవలం అంచనాలు మాత్రమే. మే 4న ఫలితాలు వెలువడినప్పుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. మేము 150కి పైగా సీట్లు గెలుచుకోబోతున్నాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దానికంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని, యువత మరియు మహిళలు పెద్ద సంఖ్యలో విజయ్‌కు మద్దతుగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని, మార్పు కోసం ఎదురుచూస్తున్న తమిళ ప్రజలు టీవీకేను ఆదరించారని ఆనంద్ మోహన్ అన్నారు.

తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్, అధికార డీఎంకే (DMK) కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కేవలం 10 నుండి 15 స్థానాలు మాత్రమే రావచ్చని కొన్ని అంచనాలు వెలువడటంతో, టీవీకే శ్రేణులు ఈ వ్యాఖ్యలు చేశాయి.మే 4న వెలువడనున్న అసలైన ఫలితాల కోసం ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu