పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. దేశీయ ఇంధన వినియోగదారులకు ఒక ఊరటనిచ్చే వార్త లభించింది.
గత 24 గంటల్లో రెండు భారీ ఓడలు హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి భారతదేశానికి తిరిగి వస్తున్నాయి. ఈ రెండు పెద్ద నౌకలు మొత్తం 66,392 మెట్రిక్ టన్నుల వంటగ్యాస్ (ఎల్పీజీ)ను మోసుకొస్తున్నాయి.
నివేదికల ప్రకారం, 21 మంది సిబ్బంది ఉన్న సైమీ అనే ఎల్పీజీ రవాణా నౌక బుధవారం నాడు హోర్ముజ్ జలసంధిని దాటింది. ఈ ఓడ శనివారం (మే 16, 2026) గుజరాత్లోని కాండ్లాలో ఉన్న దీన్దయాళ్ పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. ఖతార్లోని 'రాస్ లఫాన్' టెర్మినల్ నుండి గ్యాస్ లోడ్తో ఈ నౌక బయలుదేరింది.
మరొక నౌక ఎన్వీ సన్షైన్ గురువారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో హోర్ముజ్ జలసంధిని దాటింది. ఈ ఓడ మే 18 నాటికి న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
భారతదేశానికి వస్తున్న రెండు ఎల్పీజీ రవాణా నౌకలు హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ కూడా ధృవీకరించింది. దేశ రాజధానిలో పశ్చిమ ఆసియా సంక్షోభంపై జరిగిన అంతర-మంత్రిత్వ శాఖల విలేకరుల సమావేశంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ మాట్లాడుతూ.. "రెండు ఎల్పీజీ క్యారియర్ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటాయి" అని తెలిపారు.
ఈ రెండు కార్గో రవాణాలు భారతదేశం కోసమేనని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సమన్వయంతో ఈ కీలకమైన సముద్ర మార్గం గుండా వీటిని సురక్షితంగా తీసుకువస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మొదటి నౌక వివరాలను అధికారులు వెల్లడిస్తూ.. మార్షల్ ఐలాండ్స్ జెండాతో, భారతదేశం కోసం 19,965 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ కార్గోను మోసుకెళ్తున్న ఈ నౌకలో 21 మంది విదేశీ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇది మే 13, 2026న హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని, మే 16, 2026న కాండ్లా పోర్టుకు చేరుకుంటుందని వివరించారు.
ఎల్పీజీ ట్యాంకర్ 'సైమీ' మే 13న ఈ జలసంధి గుండా ప్రయాణించగా, 'ఎన్వీ సన్షైన్' గురువారం ఈ జలమార్గాన్ని దాటింది. రెండు నెలల క్రితం ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులు, దానికి సమాధానంగా టెహ్రాన్ (ఇరాన్) ప్రతిఘటనల తర్వాత పూర్తిగా మూతపడిన ఈ షిప్పింగ్ ఛానల్ను ఇప్పటివరకు విజయవంతంగా దాటిన భారతీయ నౌకల సంఖ్య దీనితో 13కి చేరింది.
మార్చి ప్రారంభం నుండి, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు నౌకాయానానికి తీవ్ర అంతరాయం కలిగిస్తున్నప్పటికీ.. 12 ఎల్పీజీ ట్యాంకర్లు, ఒక ముడి చమురు ట్యాంకర్తో సహా మొత్తం 13 భారతీయ జెండా కలిగిన నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటాయి. పర్షియన్ గల్ఫ్ నుండి భారతదేశం కోసం కార్గోను తీసుకువస్తున్న పలు విదేశీ జెండాలు కలిగిన ఇంధన ట్యాంకర్లు కూడా ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని దాటి దేశానికి చేరుకున్నాయి. అయితే, భారతదేశానికి రావలసిన సరుకు రవాణా చేసే మరికొన్ని విదేశీ నౌకలతో పాటు, కనీసం 12 భారతీయ నౌకలు ఇంకా గల్ఫ్ ప్రాంతంలోనే చిక్కుకుపోయి ఉన్నాయి.
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. దేశీయ ఇంధన వినియోగదారులకు ఒక ఊరటనిచ్చే వార్త లభించింది. గత 24 గంటల్లో రెండు భారీ ఓడలు హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి భారతదేశానికి తిరిగి వస్తున్నాయి. ఈ రెండు పెద్ద నౌకలు మొత్తం 66,392 మెట్రిక్ టన్నుల వంటగ్యాస్ (ఎల్పీజీ)ను మోసుకొస్తున్నాయి.

