Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IMD:దేశ ప్రజలకు కూల్‌ న్యూస్‌

IMD:దేశ ప్రజలకు కూల్‌ న్యూస్‌

ఎండతీవ్రతతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్దేశిత సమయం కంటే ముందే భారత గడ్డను తాకనున్నాయి.

సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళలోకి ప్రవేశించే రుతుపవనాలు, ఈసారి ఐదు రోజులు ముందుగానే అంటే మే 26నే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అధికారికంగా ప్రకటించింది.

ఈ ముందస్తు రాక దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, వ్యవసాయ రంగానికి కొంత ఊరటనిచ్చే అంశం. నైరుతి రుతుపవనాల ప్రారంభ దశ దేశవ్యాప్తంగా సానుకూలంగా ఉండబోతోంది. జూన్ మరియు జూలై నెలల మధ్య దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో స్థిరమైన, సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నెలల్లో కురిసే వర్షాలు ఖరీఫ్ సీజన్ సాగుకు అత్యంత కీలకం కానున్నాయి.

తొలి రెండు నెలలు వర్షాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, రుతుపవనాల చివరి అర్ధభాగంలో 'ఎల్‌నినో' (El Nino) ప్రభావం పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల జూన్-జూలై నాటికి ఎల్‌నినో పరిస్థితులు తీవ్రరూపం దాల్చవచ్చు. దీని ప్రభావంతో ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో వర్షాల పరిమాణం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సీజన్ వర్షపాతం దీర్ఘకాలిక సగటు (LPA) లో 92 శాతంగా, అంటే 'సాధారణం కంటే తక్కువ' నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు.

ఎండతీవ్రతతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్దేశిత సమయం కంటే ముందే భారత గడ్డను తాకనున్నాయి. సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళలోకి ప్రవేశించే రుతుపవనాలు, ఈసారి ఐదు రోజులు ముందుగానే అంటే మే 26నే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అధికారికంగా ప్రకటించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu