తన ఐదు దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. భారత్-ఇటలీ సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించడానికి ఆయన తన ఇటలీ సహచరురాలు జార్జియా మెలోని మరియు అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాతో సమావేశం కానున్నారు.
విమానాశ్రయంలో ఆయనకు డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సహకార మంత్రి ఆంటోనియో తాజాని స్వాగతం పలికారు. తాను రోమ్కు చేరుకున్న ఫోటోను షేర్ చేస్తూ..ఇటలీలోని రోమ్లో ల్యాండ్ అయ్యాను. నేను అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లా మరియు ప్రధానమంత్రి జార్జియా మెలోనిలను కలుసుకుని వారితో చర్చలు జరుపుతాను అని పేర్కొన్నారు.
తన ఇటలీ పర్యటన ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని పీఎం మోదీ చెప్పారు. ఈ పర్యటన ముఖ్యంగా భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ (IMEC) పై దృష్టి సారిస్తూ, భారత్-ఇటలీ సహకారాన్ని ఎలా పెంపొందించాలనే దానిపై కేంద్రీకృతమై ఉంటుంది. జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029 ను కూడా సమీక్షించడం జరుగుతుంది. నేను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తాను. బహుపక్షవాదం మరియు ప్రపంచ ఆహార భద్రత పట్ల భారతదేశ నిబద్ధతను బలోపేతం చేస్తాను అని పోస్ట్లో రాశారు.
తన ఐదు దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. భారత్-ఇటలీ సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించడానికి ఆయన తన ఇటలీ సహచరురాలు జార్జియా మెలోని మరియు అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాతో సమావేశం కానున్నారు.

