Dailyhunt
కేరళంలో యూడీఎఫ్‌దే అధికారం!

కేరళంలో యూడీఎఫ్‌దే అధికారం!

కేరళం అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బలమైన వ్యతిరేక వాతావరణం (ఆంటి-ఇంకంబెన్సీ) నెలకొన్నందున యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

తాను కేరళంలో 59 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించానని థరూర్ తెలిపారు. ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి స్పష్టంగా కనిపించిందని చెప్పారు.ప్రస్తుతం ప్రజల్లో మార్పు కావాలనే భావన బలంగా ఉంది. ఈ కారణంగా యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని అన్నారు.

తన వ్యాఖ్యలు ఎవరినీ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కాదని థరూర్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ప్రజల అభిప్రాయం మాత్రమేనని, ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి పెరిగిందని చెప్పారు.ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో ఆలస్యాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. ఐదేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు పదేళ్లు పట్టిన ఉదాహరణలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

కేరళంలో ప్రధాన పోటీ యూడీఎఫ్ మరియు ఎల్‌డీఎఫ్ మధ్యనే జరుగుతుందని థరూర్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభావం రాష్ట్రంలో చాలా తక్కువగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేరళంలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. మొత్తం 140 స్థానాల కోసం ఈ ఎన్నికలు జరుగుతుండగా, ఫలితాలు మే 4న ప్రకటించనున్నారు.

కేరళం అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బలమైన వ్యతిరేక వాతావరణం (ఆంటి-ఇంకంబెన్సీ) నెలకొన్నందున యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu