Dailyhunt
KTR:క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం

KTR:క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ అరెస్టును ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.

సోమవారం సంగారెడ్డి జైలులో క్రిశాంక్‌ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.

ఉస్మానియా విద్యార్థి నేతగా ఎదిగి, ప్రజా సమస్యలపై నిరంతరం గొంతుక వినిపిస్తున్న మన్నె క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ అరాచకాలను, అవినీతిని ప్రశ్నించినందుకే ఆయనపై ఏకంగా 35కి పైగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతును నొక్కేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో పట్టపగలే జ్యువెలరీ షాపుపై దాడి జరిగి, నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఉంటే పట్టించుకోని ప్రభుత్వం.. బీఆర్ఎస్ నాయకుల సోషల్ మీడియా పోస్టులపై పడి ఏడవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతలను పక్కనపెట్టి, కేవలం ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్న ఈ పాలన "తుగ్లక్" పాలనను తలపిస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లను అమలు చేసే వరకు బీఆర్ఎస్ విశ్రమించదని కేటీఆర్ స్పష్టం చేశారు. "మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా భయపడే ప్రసక్తే లేదు. ప్రజా పక్షాన మా పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుంది" అని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా తమపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక, క్రిశాంక్ లాంటి యువ నేతలను టార్గెట్ చేస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ అరెస్టును ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సోమవారం సంగారెడ్డి జైలులో క్రిశాంక్‌ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu