Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీటి కోసం..10 కిలోమీటర్ల నడక!

నీటి కోసం..10 కిలోమీటర్ల నడక!

కవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. మరోవైపు మండిపోతున్న వడగాల్పులు.. వీటన్నింటికీ తోడు గొంతు ఎండిపోయేలా చేస్తున్న తీవ్రమైన తాగునీటి కొరత. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా శంకర్ గఢ్ బ్లాక్ పరిధిలోని ప్రజలు అనుభవిస్తున్న నరకానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.

ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఎంత దారుణంగా తయారైందంటే, కేవలం ఒక కుండ నీటి కోసం స్థానికులు రోజుకు ఏకంగా 10 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది.

శంకర్ గఢ్ బ్లాక్ పరిధిలోని మెజారిటీ గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగుంటాయి. చేతి పంపులు, బావులు ఎండిపోయి చుక్క నీరు కూడా రావడం లేదు. బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని ఆనుకుని ఉండే బందా, ప్రయాగ్‌రాజ్ పరిసర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటిపోవడంతో పరిస్థితి మరింత ఘోరంగా మారింది.

ఎండ తీవ్రతకు తోడు వేడి గాలులు వీస్తుండటంతో, మండుటెండలోనే మహిళలు, చిన్న పిల్లలు ఖాళీ గిన్నెలు, కుండలు పట్టుకుని నీటి కోసం మైళ్ల దూరం కాలినడకన ప్రయాణిస్తున్నారు. 10 కిలోమీటర్లు నడిస్తే కానీ వారికి కనీసం తాగడానికి సరిపడా నీరు దొరకని దుస్థితి నెలకొంది.

నీటి ఎద్దడి కేవలం మనుషులకే కాకుండా మూగజీవాలకు కూడా శాపంగా మారింది. తాగడానికి నీరు, తినడానికి పచ్చిక దొరక్క పశువులు విలవిలలాడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలు తమ పశువులను వదిలేసి, తాగునీటి వసతి ఉన్న ఇతర ప్రాంతాలకు తాత్కాలికంగా వలస పోతున్నారు.

ప్రతి ఏటా వేసవి వస్తే మాకు ఈ కష్టాలు తప్పడం లేదు. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెబుతున్నా, అవి కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. మా లాంటి లోపలి గ్రామాలకు ట్యాంకర్లు రావడం లేదు అని స్థానిక గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏటా బడ్జెట్‌లు కేటాయిస్తున్నా, పైపులైన్ల ద్వారా ఇంటింటికీ నీరిచ్చే పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి యుద్ధప్రాతిపదికన ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని, శంకర్ గఢ్ ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. మరోవైపు మండిపోతున్న వడగాల్పులు.. వీటన్నింటికీ తోడు గొంతు ఎండిపోయేలా చేస్తున్న తీవ్రమైన తాగునీటి కొరత. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా శంకర్ గఢ్ బ్లాక్ పరిధిలోని ప్రజలు అనుభవిస్తున్న నరకానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఎంత దారుణంగా తయారైందంటే, కేవలం ఒక కుండ నీటి కోసం స్థానికులు రోజుకు ఏకంగా 10 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu