Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TTD:శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు

TTD:శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఈ నెల జూలై 17 నుండి 19వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు విశేష పూజలు, స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవలు, వాహనసేవలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.

ప్రతిరోజూ ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ వైభవంగా జరుగుతుంది.

మహోత్సవాల్లో భాగంగా జూలై 17న పెద్దశేష వాహనం, జూలై 18న హనుమంత వాహనం, జూలై 19న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

ఉత్సవాలకు ముందుగా జూలై 16న ఉదయం 6.30 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం, గర్భాలయం, పూజా సామగ్రిని పవిత్ర జలాలతో శుద్ధి చేసి, సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర తీర్థాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పిస్తారు.

సాక్షాత్కార వైభవోత్సవాల ముగింపు సందర్భంగా జూలై 20న శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 గంటలకు పార్వేట ఉత్సవం మరియు ప్రత్యేక ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు.ఉత్సవాల దృష్ట్యా జూలై 16న తిరుప్పావడ సేవ, అలాగే జూలై 16 నుండి 20వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.

మహోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి 14వ శతాబ్దం నుంచే విశిష్ట చారిత్రక ప్రాశస్త్యం ఉంది. విజయనగర రాజుల కాలం నుండి వేదపారాయణం, పూజా కైంకర్యాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అనంతరం శ్రీ తాళ్లపాక చిన తిరుమలాచార్యులు ఆలయాన్ని పునరుద్ధరించి పూజలను పునఃప్రారంభించారు.

1940లో స్వామివారి దివ్య ఆదేశంతో ఆలయ పునరుద్ధరణ జరగగా, ఆషాఢ శుద్ధ షష్ఠి రోజున తొలి పూజ నిర్వహించబడింది. అప్పటి నుండి ఆ దివ్య ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం "సాక్షాత్కార వైభవం" పేరిట ఈ మహోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాలకు సమానమైన ప్రాధాన్యంతో జరిగే ఈ ఉత్సవాలు వేలాది మంది భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి చేరువ చేస్తున్నాయి.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఈ నెల జూలై 17 నుండి 19వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు విశేష పూజలు, స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవలు, వాహనసేవలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu