Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Manushi Chhillar NEET: నీట్ పేపర్ లీక్ నా జీవితాన్ని తలకిందులు చేసింది.. అన్నీ వదిలేశా: మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్

Manushi Chhillar NEET: నీట్ పేపర్ లీక్ నా జీవితాన్ని తలకిందులు చేసింది.. అన్నీ వదిలేశా: మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్

Manushi Chhillar NEET: "2015లో జరిగిన నీట్ పేపర్ లీక్ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.. ఎంబీబీఎస్ సీటు సాధించడం కోసం నాకు ఎంతో ఇష్టమైన ప్రతీ చిన్న సంతోషాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది!" అంటూ మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ (Manushi Chhillar) చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ నటి సోహా అలీ ఖాన్ (Soha Ali Khan) నిర్వహించిన ఒక ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో మానుషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మెడికల్ ఎంట్రెన్స్ ప్రిపరేషన్ రోజుల్లో ఎదుర్కొన్న మానసిక వేదనను ఆమె పంచుకున్నారు.

"45 రోజుల అదనపు నరకం.. కుచిపూడి డాన్స్ పక్కనపెట్టేశా!"

ఈ పాడ్‌కాస్ట్‌లో తన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. "నీట్ పరీక్ష రాసి రిలాక్స్ అవుతున్న సమయంలో పేపర్ లీక్ అయిందని, మళ్లీ 45 రోజుల్లో రీ-ఎగ్జామ్ రాయాలని చెప్పినప్పుడు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎంబీబీఎస్ సీటు కల నెరవేర్చుకోవడం కోసం నేను ఎంతో ప్రేమించే కుచిపూడి డాన్స్, పెయింటింగ్ వంటి హాబీలను ఏడాది పాటు పూర్తిగా పక్కనపెట్టాల్సి వచ్చింది" అని మానుషి తెలిపారు.

అయితే తన తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు కావడంతో తనకు ఇంట్లో పూర్తి సపోర్ట్ లభించిందని ఆమె చెప్పారు. పీజీ హాస్టళ్లలో ఉంటూ, అప్పులు చేసి కోచింగ్ సెంటర్లకు వెళ్లే సాధారణ విద్యార్థుల కష్టాలతో పోలిస్తే తన బాధ చాలా చిన్నదని మానుషి అభిప్రాయపడ్డారు.

డాక్టర్ నుంచి గ్లోబల్ బ్యూటీ క్వీన్‌గా మానుషి ప్రయాణం

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ మెడికల్ స్టూడెంట్‌గా ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2017లో జరిగిన ప్రతిష్టాత్మక 'మిస్ వరల్డ్' (Miss World 2017) కిరీటాన్ని కైవసం చేసుకుని భారతదేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటారు. రీటా ఫరియా, ఐశ్వర్య రాయ్, డయానా హెడెన్, యుక్తా ముఖి, ప్రియాంక చోప్రా తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో భారతీయురాలిగా ఆమె చరిత్రకెక్కారు.

ఆ తర్వాత 2022లో అక్షయ్ కుమార్ సరసన ప్రసిద్ధ చారిత్రక చిత్రం 'సామ్రాట్ పృథ్వీరాజ్' (Samrat Prithviraj) ద్వారా ప్రిన్సెస్ సంయోగిత పాత్రతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశారు.

వరుస బిగ్ ప్రాజెక్టులతో బాలీవుడ్‌లో రచ్చ

ఆ తర్వాత విక్కీ కౌశల్‌తో 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ', అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌లతో కలిసి నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బడే మియాన్ చోటే మియాన్' చిత్రాలతో అలరించారు.

ఇక ఇటీవల అరుణ్ గోపాలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'టెహ్రాన్' (Tehran) సినిమాలో ఆమె డిఫరెంట్ లుక్‌లో కనిపించి ప్రశంసలు అందుకున్నారు. జీ5తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ చిత్రం ఓటీటీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతీ ఒక్కరూ వ్యాయామం అలవాటు చేసుకోవాలని మానుషి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu