ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్లోని నహర్లగన్, తెలంగాణలోని సికింద్రాబాద్ నడుమ ప్రత్యేక రైలును నడుపుతుంది.
దీంతో ప్రయాణికులకు మెరుగైన సదుపాయం అందనుంది. ఏప్రిల్ 10 నుండి మే 22 మధ్య నడిచే రైలు నెం. 07046 సికింద్రాబాద్ - నహర్లగన్, శుక్రవారాల్లో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి ఆదివారాల్లో సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే ఒక పత్రికా ప్రకటనలో ప్రయాణికులకు తెలియజేసింది.
అదేవిధంగా ఏప్రిల్ 13 నుండి మే 25 మధ్య నడిచే రైలు నెం.07047 నహర్లగన్ - సికింద్రాబాద్ సోమవారాల్లో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి బుధవారాల్లో రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మాపూర్, బలూగావ్, సి.రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్పూర్, అండుల్, దంకుని, బర్ధమాన్, బోల్పూర్ ఎస్ నిక్టన్, రాంపూర్ హాట్, మాల్దా రోడ్, కిషన్గంజ్, అలుబారి రోడ్, న్యూ జల్పైగురి, న్యూ కూచ్ బెహార్, కోక్రాఝర్, న్యూ బొంగైగావ్, బార్పేట రోడ్, రంగియావంటి స్టేషన్లలో ఆగుతుంది.
వేసవి ప్రయాణ డిమాండ్ను నిర్వహించడానికి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ - నహర్లగన్ మధ్య వారానికి ఒకసారి ప్రత్యేక 3ఏసీ రైళ్లను నడపనుంది. రైలు నెం. 07046 శుక్రవారాల్లో, రైలు నెం. 07047 సోమవారాల్లో బయలుదేరి, ఈ మార్గంలో 50కి పైగా స్టేషన్లలో ఆగుతాయి.
మరో ప్రత్యేక రైలు
దక్షిణ, తూర్పు భారతదేశాల మధ్య రద్దీని తగ్గించి ప్రయాణ సంబంధాలను బలోపేతం చేయడానికి, యశ్వంత్పూర్ జంక్షన్ మరియు కతిహార్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ ట్రైన్ సర్వీసు నెం.06571/06572ను రెండు వైపులా మరో 15 ట్రిప్పులకు పొడిగించారు. దీనివల్ల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది.
అలాగే ఈశాన్య ప్రాంతానికి రాకపోకలు సాగించే ప్రజలకు కూడా ఇది సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. యశ్వంత్పూర్ జంక్షన్ నుండి కతిహార్కు వెళ్లే రైలు నెం. 06571, 2026 ఏప్రిల్ 7 నుండి జూలై 14 వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది. కతిహార్ నుండి యశ్వంత్పూర్ జంక్షన్కు తిరుగు ప్రయాణ రైలు నెం. 06572, 2026 ఏప్రిల్ 10 నుండి జూలై 17 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. ఈ రైళ్లు మునుపటిలాగే అదే షెడ్యూల్, సమయాలు, స్టాప్లు, కోచ్ ఏర్పాట్లతో నడుస్తాయి.
Anand Sai

