Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆంధ్రప్రదేశ్ సచివాలయం లో గ్రౌండ్ ఫ్లోర్ లో లెడ్కాప్  షోరూమ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ సచివాలయం లో గ్రౌండ్ ఫ్లోర్ లో లెడ్కాప్ షోరూమ్ ప్రారంభం

అమరావతి, 08 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని 4వ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన వినూత్నమైన లిడ్క్యాప్ షోరూమ్ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి సవితతో పాటు లిడ్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు కూడా పాల్గొన్నారు. ఈ సరికొత్త అవుట్లెట్లో షూస్, చెప్పులు, హ్యాండ్బ్యాగ్స్, బెల్ట్లు వంటి అనేక రకాల స్వచ్ఛమైన లెదర్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు. సచివాలయ ఉద్యోగులకు, అక్కడికి వచ్చే సందర్శకులకు ఈ ఉత్పత్తులపై ప్రత్యేకంగా 10 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. అంతేకాకుండా, వినియోగదారులు తమకు నచ్చిన సైజు, డిజైన్కు అనుగుణంగా ఇక్కడ ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చుకునే సదుపాయాన్ని కల్పించారు. ఆర్డర్ చేసిన కేవలం రెండు వారాల వ్యవధిలోనే కస్టమ్-మేడ్ లెదర్ ఉత్పత్తులను డెలివరీ చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. 'గడిచిన రెండేళ్ల కాలంలో లిడ్క్యాప్ సంస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయి. యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వడం, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా వారికి ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యం' అని అన్నారు. ఇక మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. 'గతంలో ఉన్న సమస్యలన్నింటినీ అధిగమించి, లిడ్క్యాప్ సంస్థను పూర్తి స్థాయిలో మళ్లీ గాడిలో పెట్టాం. సంస్థలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం వల్ల పనితీరు ఎంతో మెరుగైంది. గతంలో కోర్టు కేసుల్లో చిక్కుకున్న లిడ్క్యాప్నకు సంబంధించిన విలువైన ఆస్తులను, ముఖ్యంగా విజయవాడలోని కీలకమైన భూములను ప్రభుత్వం విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకుంది.' అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu