Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్లో తీవ్రమైన ఆర్థిక తుపాను రాబోతుంది : రాహుల్ గాంధీ

భారత్లో తీవ్రమైన ఆర్థిక తుపాను రాబోతుంది : రాహుల్ గాంధీ

రాయ్బరేలీ, 19 మే (హి.స.)

భారత్లో ఎవరూ అడ్డుకోలేనటువంటి తీవ్రమైన ఆర్థిక తుపాను రాబోతుందని లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని మోదీ ఆర్థిక విధానాలు విఫలమవుతున్నాయని, ఆ తర్వాత వాటిల్లే భారీ నష్టాన్ని సామాన్యుడే ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

రాయ్బరేలీలో ఓ సభలో పాల్గొన్న రాహుల్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుబట్టారు. శ్రామిక వర్గాన్ని నష్టపరిచి, బిలియనీర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక వ్యవస్థను రూపొందించారని దుయ్యబట్టారు. పౌరులను విదేశీ ప్రయాణాలను తగ్గించుకోమని కోరుతున్న ప్రధాని.. తాను మాత్రం తరచూ విదేశాలకు వెళుతున్నారని విమర్శించారు. సమస్య పెట్రోల్, విద్యుత్ వాహనాలతో కాదని, అది ద్రవ్యోల్బణంతో అని ప్రధాని అర్థం చేసుకోవాలని సూచించారు. వెంటనే చర్యలు తీసుకుని దేశాన్ని రక్షించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu