Dailyhunt

దేశ చరిత్రలో ఇది చాలా మంచిరోజు

హైదరాబాద్, 07 ఏప్రిల్ (హి.స.)

భారత అణుశక్తి కార్యక్రమంలో మరో చారిత్రక అధ్యాయం లిఖితమైంది. తమిళనాడులోని కల్పాక్కంలో ఏర్పాటు చేసిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) క్రిటికాలిటీని సాధించింది.

దేశీయ అణు కార్యక్రమం రెండో దశలో ఇది అత్యంత కీలకమైన ముందడుగు. ఈ చారిత్రక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికి గర్వకారణమని, మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ, భారత పౌర అణు ప్రస్థానంలో ఇదొక చారిత్రక ఘట్టం. పూర్తిగా దేశీయంగా రూపొందించి, నిర్మించిన ఈ అడ్వాన్స్డ్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించడం మన శాస్త్రీయ సామర్థ్యానికి, ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం అని ప్రశంసించారు. ఈ రియాక్టర్ వినియోగించుకున్న ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలదని, ఇదే దీని ప్రత్యేకత అని ఆయన వివరించారు.

ఈ విజయంతో దేశ అణు కార్యక్రమం మూడో దశకు మార్గం సుగమం అయిందని ప్రధాని పేర్కొన్నారు. మన దేశంలో అపారంగా ఉన్న థోరియం నిల్వలను సద్వినియోగం చేసుకోవడంలో ఇదొక నిర్ణయాత్మకమైన ముందడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ విజయం వెనుక ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల కృషిని కొనియాడుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరిణామంతో అణు ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి దిశగా మరో పెద్ద అడుగు వేసినట్లయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu