Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ వేగవంతం

ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ వేగవంతం

నెల్లూరు, 21 మే (హి.స.)

:నెల్లూరు జిల్లాలోని దగదర్తి వద్ద ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది.

దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తి చేసి, ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో సుమారు 1,332.8 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగనుంది. ఇది పూర్తయితే.. రాష్ట్రంలో ఎనిమిదవ విమానాశ్రయంగా నిలవనుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్ట్ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతోంది.

మొదటి దశ నిర్మాణ పనులు ఈ ఏడాది జూన్ - జూలై మధ్య ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గడువులను పాటించేందుకు జిల్లా యంత్రాంగం చురుకుగా పని చేస్తోంది. భూసేకరణను వేగవంతం చేయడానికి ప్రభుత్వం రూ.54 కోట్లు మంజూరు చేసింది. అలాగే విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు పై దృష్టి సారించింది. భూ యజమానులకు పరిహారం చెల్లింపులు వేగంగా పూర్తి చేయడం, వివాదాలను పరిష్కరించడం, భూముల బదిలీని సాఫీగా పూర్తి చేయడం కోసం అధికారులు కృషి చేస్తున్నారు.

నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ.. ప్రకటించిన గడువులలోనే పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఇదే సమయంలో, ఎయిర్పోర్ట్ అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రైవేట్ సంస్థల నుంచి టెండర్లు (RFPలు) ఆహ్వానించారు. ఈ నెలాఖరులోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తికానుంది. ఎంపికైన సంస్థను మే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రహదారికి బదులుగా ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం ప్రతిపాదించారు. దీని ద్వారా సమీప గ్రామాలకు రాకపోకలు సాఫీగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu